Bihar |పడవ బోల్తా – ఆరుగురు మైనర్ లు మృతి
పాట్నా – బీహార్ లోని వైశాలిలోనేటి రాత్రి పడవ బోల్తా పడి ఆరుగురు మైనర్ లు చెరువులో మునిగి చనిపోయారు. ఈ సంఘటన వైశాలి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, గజఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను చెరువు నుండి బయటకు తీశారు. కుటుంబ సభ్యులు వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నీటిలో మునిగిపోయిన మిగిలిన పిల్లల కోసం ప్రత్యేక బృందాలు సహాయక కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో పిల్లలు చనిపోయిన కుటుంబాల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పిల్లలందరూ పడవలో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
దీంతో ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం పంపారు.
వైశాలి జిల్లాలోని భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ టాండ్లోని లాల్పురా గాంధీ మైదాన్ చెరువు వద్ద ఈ సంఘటన జరిగింది. ఇక్కడ సెల్ఫీ తీసుకుంటూ 6 మంది పిల్లలు నీటిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో, చెరువులో మునిగిపోయిన వారికోసం గాలిస్తున్నారు.
కాగా గల్లంతైన వారిని ప్రతాప్ టాండ్ షేర్పూర్ నివాసితులుగా గుర్తించారు. 15 ఏళ్ల ప్రియాంషు కుమార్, 17 ఏళ్ల వికాస్ కుమార్ లను లోతైన నీటి నుండి బయటకు తీశారు. మిగిలిన నలుగురు కోసం చెరువులో గాలిస్తున్నారు.