చెన్నూర్, మే 30(ఆంధ్రప్రభ) : చెన్నూరు పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకే పట్టణంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వెనుక భాగంలో రూ.13లక్షల నిధులతో నిర్మించిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తను ఎన్నికైన మొదటి నుంచి ప్రజలకు వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రాబోయే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల వైద్య బృందాలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజలకు సూచనలు ఇవ్వాలని, సీజన్ వ్యాధులు ప్రభలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్య సేవలకు వచ్చిన రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ మెరుగైన సేవలు అందివాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సత్యనారాయణ, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.