Balayya | మద్రాస్, తెలంగాణ, ఏపీ గురించి భలే చెప్పారే..

Balayya | మద్రాస్, తెలంగాణ, ఏపీ గురించి భలే చెప్పారే..

Balayya | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నట సింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) ఈ క్రేజీ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్. ఎస్ థమన్ సంగీతం అందించారు. అఖండ 2: తాండవం 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ (Madras) నా జన్మభూమి, తెలంగాణ (Telangana) నా కర్మభూమి, ఆంధ్ర (Andhra) నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు. ధర్మం కోసం జీవించాలి.. సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది. ఈ సినిమా ఒక ఎన్సైక్లోపీడియా. మా నాన్న గారు నా గురువు, దైవం. ఆయన పురాణాలు, సామాజిక, ఫాంటసీ వంటి విభిన్నమైన చిత్రాలను చేశారు. నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను.

కరోనాలో అందరూ భయపడుతున్న సమయంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆ సమయంలో అఖండ చిత్రాన్ని విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. బోయపాటి, మాది హిట్ కాంబినేషన్. సింహ లెజెండ్ అఖండ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం నా తల్లితండ్రులు, అభిమానులు ఆశీస్సులని భావిస్తున్నాను. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌ వరుసగా హిట్లు కొట్టాం. అఖండ 2 ఆ జాబితాలో చేరుతుంది. డిసెంబర్ 5 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ 2 (Akhanda 2) ఇది భారత దేశ ఆత్మ గురించి చెప్పే సినిమా. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియన్స్ ని కమర్షియల్ గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందేశం దేశం ధర్మం దైవం వేదం.. ఇది కమర్షియల్ గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అన్నారు.

Leave a Reply