AP | ట్రాక్టర్ బోల్తా నలుగు కూలీలు మృతి !
పల్నాడు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలి పని ముగించుకుని తిరిగి వస్తుండగా… ట్రాక్టర్ బోల్తా పడింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది… ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను నత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది మహిళా కూలీలు ఉన్నారు.