AP/TG | సివిల్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్ధుల జోరు..

వెలగపూడి హైదరాబాద్ – నేడు ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు మంచి ఫలితాలను సాధించారు..రెండు వందల లోపు ర్యాంకులలో మొత్తం 12 మంది చోటు దక్కించుకున్నారు.. ఈ ఫ‌లితాల‌లో ఈ సాయి శివానీకి 11, బ‌న్నా వెంక‌టేష్ కు 15, అభిషేక్ శ‌ర్మ‌కు 38, రావుల జ‌య సింహ‌రెడ్డి 46, శ్ర‌వ‌ణ్ కుమార్ రెడ్డి కి 68వ ర్యాంక్ లు ల‌భించాయి.. అలాగే విజ‌యం సాధించిన 1009 మంది అభ్య‌ర్ధుల‌లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా వారున్నారని సమాచారం

సివిల్స్ లో మెరిసిన తెలుగు వారు వీరే…

ఇ.సాయి శివాని 11వ ర్యాంకు
బన్నా వెంకటేశ్‌ 15వ ర్యాంకు
అభిషేక్ శర్మ 38వ ర్యాంకు
రావుల జయసింహారెడ్డి 46 వ‌ర్యాంకు
శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ‌ ర్యాంకు
సాయి చైతన్య జాదవ్ 68 వ‌ర్యాంకు
ఎన్ చేతనరెడ్డి 110వ‌ ర్యాంకు
చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119వ‌ ర్యాంకు
చల్లా పవన్ కల్యాణ్ 146వ‌ ర్యాంకు
ఎన్. శ్రీకాంత్ రెడ్డి 151వ‌ ర్యాంకు
నెల్లూరు సాయితేజ 154వ‌ ర్యాంకు
కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకు

Leave a Reply