AP | శ్రీశైలంలో హుండీ లెక్కింపు.. 27 రోజులకు రూ.6.09 కోట్లు !

నంద్యాల బ్యూరో, : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున భ్రమరాంబికా స్వామి దేవస్థానంలో మంగళవారం హిందీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్టు కార్యనిర్వాహణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల మేరకు గత 27 రోజులగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాల సందర్భంగా దేవస్థానమునకు రూ.6,09, 85,947 కోట్లతో పాటు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 కేజీల 200 గ్రాముల వెండి ఆభరణాలు హుండీలో లభ్యమయాయన్నరు.

వీటితో పాటు యూఎస్ఏ డాలర్లు 990, సింగపూర్ డాలర్లు 10, మలేషియా రింగేట్స్ 16, ఆస్ట్రేలియా డాలర్లు 30, యూకే ఫౌండ్స్ 20, యుఏఈ దీనార్లు 810, మెక్సికో పీసో, 250, కెనడా డాలర్ 130 కంటి విదేశీ కరెన్సీలు కూడా హుండీలో లభ్యమయ్యాయి.

సీసీ కెమెరాల మధ్య ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారితో పాటు డిప్యూటీ కార్యనిర్వాణా అధికారి ఆర్. రవణమ్మ పర్యవేక్షకులు సిబ్బంది శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *