AP | గ్రామీణ అభివృద్ధికి వెలుగు మార్గదర్శి: ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి : గ్రామీణ పేదరిక నిర్మూలనకు ప్రేరణగా నిలిచిన ‘వెలుగు’ ప్రాజెక్టు, ఇప్పుడు సమగ్ర గ్రామీణాభివృద్ధి ఉద్యమంగా ఎదిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం, పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆయన ప్రశంసించారు.

“1999లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రారంభమైన వెలుగు, ఒక చిన్న ప్రయోగంలా మొదలై, గ్రామీణ మహిళల భాగస్వామ్యంతో విస్తృతంగా అభివృద్ధి చెందిందన్నారు. మహిళా సంఘాల రూపంలో సామూహిక శక్తిగా మారిన ఈ ఉద్యమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందిని సీఎం అన్నారు.

కాలక్రమంలో వెలుగు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థగా – సెర్ప్ (SERP)గా – రూపాంతరం చెందిందని, సెర్ప్ గ్రామీణాభివృద్ధికి మార్గదర్శక మోడల్‌గా నిలిచిందని చంద్రబాబు స్పష్టం చేశారు. “ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌దే కాదు, దేశానికే గర్వకారణం,” అని ఆయన పేర్కొన్నారు.

సెర్ప్ 25వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, గ్రామీణ మహిళలు, సెర్ప్ ఉద్యోగుల కృషిని సీఎం అభినందించారు. “మీ సమిష్టి శ్రమ, అంకితభావం వల్లే ఇవాళ గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. మీతో మేం ఉన్నాం. సెర్ప్‌ను మరింత బలోపేతం చేస్తాం,” అని భరోసా ఇచ్చారు.

Leave a Reply