విజయవాడ, ఆంధ్రప్రదేశ్ : భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎంపీఎల్) విజయవాడలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్ను ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో మహీంద్రా నుండి వీపీ – సేల్స్, కస్టమర్ కేర్ & సీఎక్స్ పవన్ కుమార్, ప్రెసిడెంట్ & నేషనల్ సేల్స్ హెడ్ బనేశ్వర్ బెనర్జీ మరియు ఇరు సంస్థల నుంచి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
విజయవాడలోని ఏలూరు రోడ్డు, ఎనికెపాడులో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ఆధునిక షోరూమ్ లో మహీంద్రా విస్తృత శ్రేణి వాహనాలు – ప్యాసింజర్ వెహికల్ (ఐసీఈ & ఈవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఎస్సీవీ), లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్ఎంఎం) అన్నీ ఒకే చోట లభిస్తాయి.
ఈ కొత్త సౌకర్యం వాహన విక్రయాలు, అమ్మకాల తర్వాత సేవలతో పాటు వాహన ఫాస్ట్-ఛార్జింగ్ సౌకర్యాన్ని అందించేలా రూపొందింది. ఆధునిక రంగుల సమ్మేళనం, ఆకర్షణీయమైన లైటింగ్, సహజమైన సాంకేతికతతో షోరూమ్లోని ప్రతి అంశం అభివృద్ధిపరమైన డిజైన్, ఆవిష్కరణ, ఆకర్షించేవిధంగా రూపొందించారు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ… “దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అత్యాధునిక 3ఎస్ సౌకర్యమైన 135వ మహీంద్రా సౌకర్యాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. దీని ద్వారా మహీంద్రాతో మా దీర్ఘకాల అనుబంధం మరింత బలోపేతం అవుతున్నందుకు మేం గర్విస్తున్నాం. మహీంద్రాతో మా ప్రయాణం దాదాపు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇది ఉమ్మడి విలువలు మరియు శ్రేష్ఠత పట్ల నిబద్ధతతో కూడినది. ఆరు రాష్ట్రాలలో బలమైన నెట్వర్క్తో, మేము కస్టమర్లతో మమేకమయ్యాం. మహీంద్రా అధునాతన సాంకేతిక ఉత్పత్తులు, కస్టమర్-కేంద్రీకృత విధానం మరియు కస్టమర్ అవసరాల పట్ల మా లోతైన అవగాహనతో వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం” అని పేర్కొన్నారు.
రూ.15 కోట్లతో దీన్ని స్థాపించారు. కాగా.. ఇది ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) కృష్ణా జిల్లాలో ఐదో డీలర్షిప్ అవుట్లెట్గా నిలుస్తుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ జిల్లాలో మరో రెండు కొత్త కేంద్రాలను స్థాపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

