ADB | జన్నారం డిప్యూటి రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్..

జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం డిప్యూటీ రేంజు ఆఫీసరు తిరుపతిని విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అబియోగం మేరకు (బుధవారం) ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జిల్లా జన్నారం రేంజ్ లోని కొత్తూరుపల్లె సమీపాన రిజర్వ్ ఫారెస్ట్ అడవుల్లో.. గతంలో కొంతమంది గిరిజనులు గుడిసెలు వేసుకోగా, రెండు నెలల క్రితం అటవీశాఖఅధికారులు మూకుమ్మడిగా దాడులు చేసి 22 గుడిసెలను తొలగించారు.

అయినప్పటికీ అదే ప్రదేశంలో మళ్లీ కొన్ని గుడిసెలను గిరిజనులు వేసుకున్నారు. ఈ విషయం మంచిర్యాల ఎఫ్డీపీటీ, కవ్వాల టైగర్ రిజర్వ్ సీఎఫ్ శాంతారాం గత వారం క్రితం ఆ ప్రదేశానికి వచ్చి తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో తాను వచ్చి తనిఖీ చేసేంత వరకు ఆ గుడిసెలను తొలగించకపోవడం పట్ల సీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో అటవీ భూమిని సంరక్షించడంలో అ నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు శాంతారాం నివేదిక ఆధారంగా కాలేశ్వరం జోను సీసీఎఫ్ ప్రభాకర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతిని సస్పెండ్ చేశారు.

ఈ మేరకు స్థానిక డివిజన్, రేంజు కార్యాలయాలకు సస్పెన్షన్ ఆదేశాలు వచ్చినట్లు స్థానిక ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు తెలిపారు. ఇదే వ్యవహారంలో వారం క్రితం జన్నారం బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ ను విధుల్లో నిర్లక్ష్యం వహించాలని అభియోగం మేరకు సీఎఫ్ సస్పెండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *