Accident | గుడిపాడులో స్కూల్ అండ్ కాలేజీ బస్సు బోల్తా….

Accident | గుడిపాడులో స్కూల్ అండ్ కాలేజీ బస్సు బోల్తా….
- తీవ్ర గాయాలతో బయటపడ్డ విద్యార్థులు….
- ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు…
- స్థాయికి మించి విద్యార్థులను బస్సులోకి ఎక్కించడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్న గ్రామస్తులు….
Accident | ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ఈ రోజు మర్లపాలెం గుడిపాడుకి మధ్యలో విస్సన్నపేట శ్రీ సిద్ధార్థ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ అండ్ కాలేజీ బస్సు బోల్తాపడి పలువురు విద్యార్థులకు గాయాలతో కాగా, కొందరు విద్యార్థులకు చేతులు, కాళ్లు విరిగినట్లు సమాచారం.
ఒక విద్యార్థికైతే పళ్ళు కూడా విరిగాయి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం వల్లే ఈ ఘటన జరిగిందని, సంఘటనా స్థలానికి చేరువలో ఉన్న పలువురు గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.







