హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నగరంలోని బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రితో పాటు మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్ రావు, సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదైంది. హరీశ్ రావుపై 351(2), ఆర్ డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఎస్ఐఆర్ లో రెండో నిందితుడిగా హరీశ్ రావు పేరును పోలీసులు చేర్చారు.
TG | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు
