RTC | బస్సు సమస్యలు పరిష్కరించాలి

RTC | బస్సు సమస్యలు పరిష్కరించాలి
- ఆర్టీసీ ఆర్ఎం కు వినతి
RTC | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం ప్రజలు ఎదుర్కొంటున్న బస్సుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాచిగూడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధా ప్రమీలకు సర్పంచ్ నిరంజన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. దీనికి రీజినల్ మేనేజర్ సానుకులంగా స్పదించి అతి త్వరలో బస్సు లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ నిరంజన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కొత్త ఐలమ్మలింగయ్య యాదవ్, సుంకరి విజయ్ గౌడ్, పొట్లపల్లి శివశంకర్ గౌడ్, సంగెం నర్సమ్మ చంద్రయ్య, ఒంటెద్దు లక్ష్మమ్మ, మల్కాపూర్ గ్రామ కన్వీనర్ ముదిగొండ వెంకటేష్, రామలింగేశ్వర స్వామి మాజీ చైర్మన్ కలగొని శ్రీధర్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
