Team India | టీమిండియా జోరు..

Team India | టీమిండియా జోరు..

నేడే దక్షిణాఫ్రికాతో రెండో వన్డే

గెలిస్తే సిరీస్ వ‌శం..

అంద‌రి క‌ళ్లు రోహిత్‌, కోహ్లీపైనే..

Team India | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం(International Stadium)లో మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్​కు రెడీ అవుతుంది. తొలి మ్యాచ్​లో విజయంతో జోరుమీదున్న టీమ్ఇండియా(Team India) రెండో వన్డేలోనూ అదే ఫామ్​ కనబర్చాలని భావిస్తోంది. సొంతగడ్డపై టెస్టు సిరీస్​ ఓటమికి ప్రతీకారంగా, వన్డే సిరీస్​ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకోవాలని భారత్ ఆశిస్తోంది.

తొలి మ్యాచ్​లో అంచనాలు అందుకొని రాణించిన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Rohit Sharma, Virat Kohli)నే ఈ వన్డేలోనూ టీమ్ఇండియాకు కీలకం కానున్నారు. అదే జోరును కొనసాగించితే అభిమానులకు పండగే.

మరోసారి రో-కో సెన్సేషన్ చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఈసారైనా రాణించాల్సి ఉంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్​ కూడా బలంగానే ఉంది. టాపార్డర్​లో రో-కో రాణిస్తే జట్టుకు భారీ స్కోర్ ఖాయం.

రాంచీ వన్డేలో 349 స్కోర్(Score 349) చేసినా, భారత్ అతి కష్టంమీద నెగ్గింది. భారీ ఛేదనలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 3 కీలక వికెట్లు కోల్పోయినా, టార్గెట్‌కు ద‌గ్గ‌ర‌గా వచ్చిందంటే మన బౌలింగ్​ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాయ్​పుర్ పిచ్ స్పిన్నర్లతోపాటు పేసర్లకు కూడా అనుకూలమే. హర్షిత్ రాణా, అర్షదీప్, కుల్దీప్ వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు.

తొలి మ్యాచ్​లో నుంచి పాఠాలు నేర్చుకొని, అవి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత బౌలర్లదే. తొలి మ్యాచ్​లో ఆల్​రౌండర్(Allrounder) విఫలమయ్యాడు. అందుకే ఈ మ్యాచ్​లో వాషింగ్టన్ సుందర్​కు విశ్రాంతి ఇచ్చి నితీశ్ కుమార్ లేదా రిషబ్ పంత్​ను తీసుకునే ఛాన్స్ ఉంది. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

ప్రత్యర్థి సౌతాఫ్రికా రాంచీ మ్యాచ్​లో ఓఢినా, వాళ్లు పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆఖరు బ్యాటర్​ దాకా పోరాడారు. ఆ రోజు టార్గెట్ 30 పరుగులు(Target 30 runs) తక్కువ ఉంటే ఫలితం మ‌రోలా ఉండేదేమో. ఇక తొలి వన్డేలో ఓటమితో సౌతాఫ్రికా, రెండో మ్యాచ్​కు మరింత సన్నద్ధంగా తిరిగి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బార్ట్​మాన్, సుబ్రయన్, బర్గర్ బౌలింగ్​లో కీలకం కానుండగా, మార్​క్రమ్, డికాక్, రికెల్​టన్, టోనీ జార్జిలతో సౌతాఫ్రికా బలంగా కనిపిస్తుంది. ఇక ఆల్​రౌండర్ మార్కో యాన్సెన్​ ఆ జట్టుకు అతిపెద్ద బలంగా ఉన్నాడు. అతడిని ఎదుర్కోవడం భారత్​కు పెద్ద సవాల్ కానుంది.

Click Here To Read Cricket | ఇక వ‌న్డే స‌మ‌రం…

Click Here To Read |

Leave a Reply