Warangal | మూగ జీవాలపై దాడి…
Warangal | టేకుమట్ల, ఆంధ్రప్రభ : గ్రామాన్ని రక్షించే గ్రామ సింహాలు ఇప్పుడు ప్రజల పాలిట మృత్యు సింహాలుగా మారుతున్నాయి. విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్(Caref Address)గా నిలిచే కుక్కలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి.
భూపాలపల్లి జిల్లా(Bhupalapally District) టేకుమట్ల మండల పరిధిలోని ప్రతి గ్రామంలో సుమారు20-30 వీధి కుక్కలు ఉంటాయి. గ్రామాల్లో స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తూ, కనబడిన వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.
కుక్కల స్వైర విహారం…
కుక్కల భయానికి ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం భయపడుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు(Street Lights) సరిగ్గా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా సేద తీరుతున్నాయి. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై దాడికి పాల్పడుతున్నాయి. దాంతో రాత్రిళ్లు ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది.
మూగ జీవాల పైన దాడి…
మండల వ్యాప్తంగా కుక్కల దాడిలో పలువురి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు(Cows, Buffaloes, Goats, Sheep) మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కుక్కల దాడిలో గొర్రెలు, లేగ దూడలు మృత్యువాత చెందటంతో పాడిపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్ట పోతున్నారు.

