గొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం అమీర్ నగర్ లో ఐకేపీ సెంటర్ నర్సాపూర్, కోన సముందర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా(Nizamabad District) అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి(Manala Mohan Reddy) ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధరను తీసుకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యం(A grade grain) రేటు రూ.2,389,బి గ్రేడ్ కు రూ 2,369 ప్రభుత్వం మద్దతు ధరను అందిస్తుందని తెలిపారు. సంచులు, లారీల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య(Palepu Narsayya), వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకెట రవి, ఏఎంసీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్, రాములు నాయక్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, గోపిడి లింగారెడ్డి(Gopidi Linga Reddy), నూకల బుచ్చి మల్లయ్య, కొమ్ముల రాజేందర్, భూమారెడ్డి, గంగారెడ్డి, పుప్పాల నర్సయ్య, సంజీవ్, గణేష్, రాకేష్, సామ మహేందర్, సామ భూమారెడ్డి, చెంగల అశోక్, ఐకేపీ సీసీ లు పీరియా, రవి, పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్ బాబూరావు, కార్యదర్శి కార్తీక్, మాజీ చైర్మన్ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

