Tirumala | ఈనెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

తిరుమ‌ల : తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం (Anivar Asthanam) నిర్వహించనున్నారు. జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహిస్తారని.. ఈ క్రమంలో రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ‘జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు (VIP break visits canceled) చేయడమైనది. జులై 14, 15వ తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది’ అంటూ టీటీడీ ప్రకటనలో తెలిపింది.

Leave a Reply