NLG | సంస్థాన్ లో సంతకాల ఫోర్జరీ కలకలం

  • మెడికల్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ
  • కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం గెజిటెడ్ సంతకాల ఫోర్జరీ


సంస్థాన్ నారాయణపురం, జూన్ 27 (ఆంధ్రప్రభ): సంస్థాన్ నారాయణపురం (Sansthan Narayanapuram) మండల కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, గెజిటెడ్ అధికారుల సంతకం ఫోర్జరీ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ధరణి మీసేవ సెంటర్ల (Dharani Meeseva Centers) ను ఆర్డీవో శేఖర్ రెడ్డి తనిఖీ చేసి పరిశీలించారు. తన సంతకం ఫోర్జరీ అయిందని పోలీసులకు వైద్యాధికారి రవీణ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మీసేవ ధరణి సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులను విచారించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో శేఖర్ రెడ్డి (RDO Shekhar Reddy) మాట్లాడుతూ.. జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో సంతకాలు ఫోర్జరీ జరిగినట్టు త‌న దృష్టికి వచ్చిందని, గత రెండు సంవత్సరాలుగా జనన మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డుల (Aadhaar cards) ను సరిచూసుకోవాలని బాధితులు ఎవరైనా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పరిశీలించుకోవాలని, భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నకిలీవో ఒరిజినల్ వా అనేది సరిచూసుకోవాలన్నారు. గతంలో కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తులను పరిశీలించగా 20దరఖాస్తులు నకిలీవిగా తేలాయని వెల్లడించారు. వైద్యాధికారి రవీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఎస్ జగన్ తెలిపారు. ఆర్డిఓ వెంట త‌హ‌సీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రమోద్ కుమార్ ఉన్నారు.

Leave a Reply