By Elections | ఉప ఎన్నిక‌ల‌లో బిజెపికి షాక్ – గుజ‌రాత్ లో ఆప్ పాగా

కేర‌ళ‌లో కాంగ్రెస్, బెంగాల్ తృణ‌మూల్
పంజాబ్ లో ఆప్ అభ్య‌ర్ధుల విజ‌యం
గుజరాత్ లోని కాడి స్థానంలో క‌మ‌ల వికానం

న్యూఢిల్లీ – నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బిజెపికి షాక్ తగిలింది. ప్రధాని మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఒక స్థానంలో ఆప్ విజ‌యం సాధించ‌గా, మ‌రో స్థానంలో బిజెపి పాగా వేసింది.. గుజరాత్‌లోని విసావదార్‌ అసెంబ్లీ స్థానంలో ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు.. ఈ ఉప ఎన్నిక‌ల‌లో ఆప్ గెల‌వ‌డంతో తొలిసారిగా గుజ‌రాత్ అసెంబ్లీలో కాలుపెట్ట‌నుంది. ఇక గుజరాత్‌లోని కాడీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర కుమార్‌ గెలిచారు. పంజాజ్‌లోని లూథియానా స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అభ్యర్థి సంజీవ్‌ అరోరా విజయం సాధించారు. కేరళలోని నీలంబూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్యధాన్‌ శోకత్ స‌మీప లెఫ్ట్ పార్టీ అభ్య‌ర్ధిపై గెలుపొందారు. ఇక, బెంగాల్‌లో కాళీగంజ్ స్థానం నుంచి తృణముల్‌ అభ్యర్థి అలిఫా అహ్మద్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Leave a Reply