హైదరాబాద్ : మధ్య – పశ్చిమ ఆఫ్రికా దేశాల నుండి వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు ఈ రోజు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) చేరుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ ప్రదేశాలను సందర్శించనున్నారు. దాంతో పాటు భారతీయ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన పోచంపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు.












