Shankarapalli | రైలు పట్టాలపై కారులో యువతి హల్చల్

శంకర్ పల్లి, (ఆంధ్రప్రభ) : కార్లు కూడా రైలు పట్టాలపై వెళుతూ ఉంటాయన్న సంఘటన శంకరపల్లి (Shankarapalli) మండలంలోని కొండకల్ (Kondakal) పరిధిలో జరిగింది. కొంతమంది వింత చేష్టలు తారా స్థాయికి చేరుకుంటాయి. మరి కొంతమంది సోషల్ మీడియా లో వ్యూస్ కోసం చెయ్యరాని పనులన్నీ చేస్తూ ఉంటారు.

యువతి గంజాయి మత్తులో మూర్ఖంగా రైలు పట్టాల (train tracks) పై కారును డ్రైవ్ చేస్తూ దాదాపు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని అను మానిస్తున్నారు. రైలు పట్టాలపై కారును గమనించిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రైల్వే పోలీసులు ఎంత వారించినా యువతి కారును అలాగే డ్రైవింగ్ చేయ‌డం కొసమెరుపు. రైల్వే పోలీసులు (Railway Police) అతి కష్టంమీద రైలు పట్టాలపై కారును ఆపి పక్కకు తొలగించారు. ఈ ఘ‌ట‌న‌పై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply