హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తాం
- టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి
- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో త్వరలో మెగా హెల్త్ క్యాంప్
- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి శ్రీనివాస శర్మ
రామంపేట, ఆంధ్రప్రభ : జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించే విధంగా టీయూడబ్ల్యూజే తరఫున కృషి చేస్తున్నామని టియుడబ్ల్యూజే(TUWJ) (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి(Shankar Dayal Chari) అన్నారు. ఈ రోజు స్థానిక ప్రగతి రిసార్ట్ లో రామాయంపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే జర్నలిస్టులకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించేందుకు రాష్ట్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఎక్కడ ఏ సమస్య వచ్చిన టియుడబ్ల్యూజే అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిజి శ్రీనివాస్ శర్మ(DG Srinivas Sharma) మాట్లాడుతూ, టియుడబ్ల్యూజే సంఘం రామయంపేట ప్రెస్ క్లబ్ తరఫున మండల పరిధిలో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నామన్నారు. రామయంపేట(Ramayampet) జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని జర్నలిస్టుల(Journalists) సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందరం కలిసి ఒక్కటిగా ముందుకు వెళితే సమస్యల పరిష్కారం సులువు అవుతుందని జిల్లా కోశాధికారి వూడెం దేవరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, ఉపాధ్యక్షులు బొంతల సత్యనారాయణ(Bonthala Satyanarayana), బల్ల యాదగిరి, కోశాధికారి తుజాల శ్రీనివాస్ గౌడ్, సంయుక్త కార్యదర్శి కర్రే నరేందర్, కార్యవర్గ సభ్యులు తుడుం పెంటయ్య, సార్గు నర్సింలు, రామచంద్ర రెడ్డి, సర్దార్ లు పాల్గొన్నారు.

