• ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • యూరియా కొరత లేదు
  • వదంతులను నమ్మవద్దు
  • పల్లెకు పోదాంతో సమస్యల పరిష్కారం
  • కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
  • మద్దతు ధరకే ఉల్లి కొంటాం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉల్లి రైతులు ఆందోళన చెందనవసరం లేదని, మార్కెట్ యార్డ్(Market Yard)కు వచ్చిన ఉల్లి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 ల మద్దతు ధర స్తోందని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.

ఆదివారం కలెక్టరేట్(Collectorate) కాన్ఫరెన్స్ హాల్ లో యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు, పల్లెకు పోదాం అంశాల పై జిల్లా కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది దాదాపు 31 వేల ఎకరాల్లో ఉల్లి పంటను రైతులు సాగు చేశారని , సుమారు 1.50 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందన్నారు.

ఇప్పటికీ మార్క్ ఫెడ్(Mark Fed), మార్కెట్ యార్డు ల నుంచి 11,174 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామన్నారు. టన్ను ఉల్లికి రూ.1200ల మద్దతు ధరను సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. మూడవ తేదీ వరకు మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికీ 1226 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా, శనివారం ఒక్క రోజే 1600 టన్నుల ఉల్లి వచ్చిందన్నారు.

5 రోజుల్లో వచ్చినంత ఉల్లి కేవలం నిన్నఒక రోజులోనే వచ్చిందన్నారు. అందులో 800 టన్నులను కొనుగోలు చేశామన్నారు. మిగిలిన ఉల్లిని కూడా కొనుగోలు చేస్తామన్నారు. టెండర్ ప్రక్రియ(Tender Process) యధావిధిగా కొనుగోలు జరుగుతుందని, టెండర్ లో 12 రూపాయలు కంటే తక్కువ ధర వస్తే, మిగిలిన మొత్తాన్నిప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి రైతుల(Mark Fed, Market Yard, Collectorate, Tender Process, Farmers)కు అన్యాయం జరగకుండా కిలోకు కనీస గిట్టుబాటు ధర 12 రూపాయలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

రైతులు ఉల్లిని తీసుకొని వచ్చే సమయంలో ఉల్లిని ఆరబెట్టి తీసుకుని రావాలని కలెక్టర్ రైతులకు సూచించారు. కోత రాకముందే పంటను కోసి తీసుకొని రావద్దని కలెక్టర్ సూచించారు. బయట జరుగుతున్నఫేక్ ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు..

యూరియా కొరత లేదు

జిల్లాలో ప్రస్తుతం యూరియా కొరత లేదని కలెక్టర్ తెలిపారు. ఈ అంశం పై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి రెండు రోజులకోసారి కలెక్టర్ లతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 3, 200 టన్నుల యూరియా(Urea) అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.

తొలుత కొన్ని మండలాలలో యూరియా సమస్యలు వచ్చాయని, సంబంధిత సమస్యలకు వెంటనే స్పందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు అందరి రైతులకు యూరియా(Supply)ను సరఫరా చేశామన్నారు.

వచ్చే 2 రోజుల్లో 2,600 టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. యూరియాను తగినంత మోతాదులో వినియోగించుకోవాలని, నానో యూరియాను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

గత ఏడాది 56 వేల టన్నుల యూరియాను రైతులకు అందచేయగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 64.746 టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే అదనంగా 8 వేల టన్నుల యూరియా ఇచ్చామన్నారు.


యూరియా డైవర్షన్(Diversion) కు సంబంధించి 5 కేసులు నమోదు చేశామని, 6ఏ యాక్తు కింద 13 కేసులు నమోదు చేశామన్నారు. 3 లెసైన్సు లు సస్పెండ్ చేశామని, 4 షో కాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. రూ.1.05 కోట్ల విలువ చేసే 402 టన్నుల యూరియాను సీజ్ చేశామన్నారు. 172 యూరియా ఔట్ లెట్లను తనిఖీ చేశారని, ప్రైవేట్ షాపు(Private Shop)ల్లో తనిఖీ చేశామని కలెక్టర్ వివరించారు. రైతు సేవా కేంద్రాలు, పిఎసిఎస్ ద్వారా 70 శాతం, ప్రైవేట్ డీలర్ల దగ్గర 30 శాతం యూరియా మాత్రమే ఉంచుతున్నామని కలెక్టర్ తెలిపారు.

పల్లెకు పోదాంతో సమస్యల పరిష్కారం

జిల్లాలో పల్లెకు పోదాం అనే వినూత్న కార్యక్రమాన్నినిన్నటి నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా 80 మంది ప్రత్యేక అధికారులను గుర్తించి నియమించి, వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత అధికారులు గ్రామం మొత్తం తిరిగి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అక్కడే పరిష్కరిస్తారన్నారు. పాఠశాలలు(Schools), అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటల్స్, హాస్టల్స్, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేస్తారు.

పారిశుధ్యం, రోడ్లు, నీటి సరఫరా, ఇళ్ళ నిర్మాణాలు తదితర అంశాలను కూడా పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రొఫార్మాలో పొందుపరచి ఆన్ లైన్ పోర్టల్ లో అప్డేట్ చేస్తారని కలెక్టర్ వివరిచారు. ఏ శాఖకు సంబంధించిన సమస్యను ఆ శాఖల(Departments) లాగిన్ లకు పంపించి సంబంధిత హెచ్ ఓ డి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

సమస్యలను ఆర్థిక, ఆర్థికేతర సమస్యలుగా విభజిస్తామని, ఆర్థిక సమస్యలకు ఏ పథకం కింద అర్హత ఉంటే ఆ పథకం కింద చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమం ద్వారా 6 నెలల్లో జిల్లాలోని అన్నిగ్రామాల తనిఖీలు పూర్తవుతాయన్నారు. కేవలం నిన్నటి రోజున దాదాపు 25 సమస్యలు పరిష్కరించినట్టు కలెక్టర్ వివరించారు.

అసత్య ప్రచారాలొద్దు
ఉల్లి ధరలపై అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు యూరియా అమ్మే వారిని, అదే విధంగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దులకు అక్రమంగా సరఫరా చేసే వారి పై 5 క్రిమినల్ కేసులు(Criminal Cases) నమోదు చేశామన్నారు.

అన్ని సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్, విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతోతనిఖీ చేపట్టామన్నారు. . విజిలెన్స్ శాఖతో కలిసి సంయుక్త చర్యలు చేపట్టామన్నారు. ఉల్లిని ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేస్తారని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎస్పీ సూచించారు..రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని ఎస్పీ సూచించారు.

Leave a Reply