Warangal | విషయ జ్ఞానాన్ని పెంపొందింస్తుంది…
Warangal | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : డిజిటల్ బోధన విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని, వారిలో పాఠ్యంశాలపై అవగాహన పెంపొందుతుందని మండల విద్యాశాకాధికారి ఏ. రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ను ఈ రోజు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రొజెక్టర్ను అందుబాటులోకి తెచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల్లో విషయ జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను ఉపయోగించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.విజయలక్ష్మి, ఉపాధ్యాయ బృందం జీ పుష్పనీలా, పి ఉపేందర్, పి.సంధ్య, ఉమారాణి,ఉషరాణి, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ సుధాకర్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

