ఐపీఎల్ 2025 సీజన్లో విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ… 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు నమోదు కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఆర్సిబి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.
అయితే, ఆర్సీబీ నిర్వహించిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన కెరీర్లో మూడు ఫార్మాట్లలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లు ఎవరు అని అడిగినప్పుడు, నలుగురి పేర్లను పేర్కొన్నాడు.
టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్, వన్డేల్లో శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ, ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, టీ20ల్లో సునీల్ నరైన్ తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లని విరాట్ అన్నారు.