యూపీఎస్సీ (UPSC) 2025 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూన్ 11న విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మే 25న నిర్వహించిన ఈ పరీక్షకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో చూసుకోవచ్చు. ఫలితాలను పరిశీలించేందుకు అభ్యర్థులు తమ రోల్ నంబర్ ఆధారంగా లిస్ట్ను చెక్ చేసుకోవాలి.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కు హాజరయ్యే అర్హత పొందారు. మెయిన్స్లో ఉత్తీర్ణులైన వారు తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకు హాజరవుతారు. మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను యూపీఎస్సీ రూపొందిస్తుంది.
ఈ ఏడాది మెయిన్స్ పరీక్ష ఆగస్టు 22న నిర్వహించనున్నారు. ఈ సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా 979 పోస్టులను భర్తీ చేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది.