గర్భిణి స్త్రీలకు 5వ నెల వచ్చేసరికి గర్భంలో పిండము సకల అవయవములను ఏర్పర్చుకుని పరిపూర్ణ ఆకారంతో ఉంటుంది. అప్పటి నుంచి తల్లికి అశౌచము ఉంటుంది. పూజా మందిరంలోకి, దేవాలయాలకు వెళ్లరాదు. ఎలాంటి పూజలు చేయించకూడదు. ఇది ఆచారము అని అపార్ధం చేసుకోకుండా సౌకర్యంగా భావించాలి. నెలలు నిండిన కొద్ది గర్భ భారంతో అలసటా, ఆయాసము శరీరాన్ని ఆక్రమిస్తాయి. కావున లౌకికంగా, పారమార్ధికంగా 5వ నెల వచ్చిన పిదప పూజాది కార్యక్రమాలను చేయడం, నదులను దాటడం, పర్వతాలు ఎక్కడం వంటి బరువైన పనులను చేయరాదని శాస్త్రం చెప్పింది.
గర్భిణీ స్త్రీలు ఏ నెల వరకు పూజ చేయవచ్చు?
