MDK | కారు ఢీకొని.. ఇద్దరు మహిళల మృతి

దుబ్బాక : ఉపాధి హామీ పనికి వెళ్తున్న ఇద్దరు మహిళలను అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం పరిధిలోని పోతారెడ్డిపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దేవవ్వ, రామవ్వలు రోజు లాగే ఉపాధి పనులకు బయలుదేరారు. ఈ క్రమంలోనే అతివేగంగా దూసుకెళ్తున్న కారు వారిని ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందారు. తోటి మహిళా కూలీలు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును, కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply