సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : లంచగొండి అధికారులు మరోసారీ ఏసీబీ వలలో చిక్కారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 20వేల రూపాయల లంచం తీసుకుంటుండగా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ డివిజన్ సిక్స్ సూపరింటెండెంట్ శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సురేష్ లు పట్టుబడ్డారు.
అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఇజాజ్ సిక్ లీవ్ పెట్టగా, అది ధ్రువీకరించేందుకు 20వేల రూపాయలు లంచం అడగ్గా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు దాడులు నిర్వహించి ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలియజేశారు.