Two Bikes | కళ్లలో కారం కొట్టి..

Two Bikes | కళ్లలో కారం కొట్టి..

  • రంగంలోకి నాలుగు పోలీసు బృందాలు

Two Bikes | కూకట్‌పల్లి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : నగరంలో భారీ దోపిడీ కలకలం రేపింది. బైక్‌పై వెళ్తున్న వారి కళ్లలో కారం కొట్టి కోటి రూపాయల నగదును దోచుకెళ్లిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పురాకు చెందిన ఏసీ మెకానిక్‌లు మహ్మద్ ఖుస్రూ, మహ్మద్ అజీముద్దీన్ తమ స్కూటర్ పై కోటి రూపాయల నగదును కార్టన్ బాక్స్‌లో పెట్టుకుని వెళ్తున్నారు.

రాత్రి 9:40 గంటల సమయంలో కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 837 వద్దకు చేరుకోగానే, రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు గుర్తుతెలియని దుండ‌గులు బాధితుల‌ను అడ్డుకున్నారు. క్షణాల వ్యవధిలోనే బాధితుల కళ్లలో కారం కొట్టి, వారి వద్ద ఉన్న నగదు పెట్టెను లాక్కొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కూకట్‌పల్లి పోలీసులు నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దోపిడీ జరగడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది.

Two Bikes | రూ.కోటి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు…

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న భారీ దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.కోటిలో రూ.77 లక్షలకుపైగా రికవరీ చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. శంషాబాద్‌ వద్ద వారిని పట్టుకున్నారు. బహదూర్‌పురాకు చెందిన కుస్రు, అజీముద్దీన్‌ డబ్బుతో వెళ్తుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి కళ్లలో కారం చల్లి.. రూ.కోటి నగదును దోచుకెళ్లారు.

click here to read more : 108 vehicle | పలు వాహనాలను ఢీకొట్టిన సైకో…

click here to read more :

Leave a Reply