ఖమ్మం : కరెంట్ షాక్తో (power shocked) తండ్రీకొడుకు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని ఇల్లందు (Yellendu) మండలంలోని ఎల్లాపురం గ్రామంలో ( ellapuram village) బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
ఏనుగు నరసయ్య తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం బాత్రూంకి వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగకు ఆనుకొని విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన తండ్రిని కాపాడేందుకు కొడుకు ప్రవీణ్ హుటాహుటిన వెళ్లి ప్రయత్నించగా దురదృష్టవశాత్తు ప్రవీణ్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిని గమనించిన నరసయ్య భార్య ఎర్రమ్మ వారిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించి తాను స్పృహ కోల్పోయింది. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.