Top Story | ఆర్గానిక్ టెర్ర‌ర్‌! నాసి రకానికి స‌రికొత్త‌ బురఖా

పుట్టగొడుగుల్లా సేంద్రియ‌ కంపెనీల విస్తరణ
పేరుకు మాత్ర‌మే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సులు
పర్యవేక్షణ లేదు.. నియంత్రణ అస్స‌ల్లేదు
అధ‌ర‌హో అంటున్న సెంద్రియ ప‌ధార్థాల‌ ధరలు
ఎక్స్‌పైరీ, మాన్యుఫ్యాక్ష‌ర్ తేదీ లేకుండా అమ్మ‌కాలు
ఫుడ్ పాయిజ‌న్ అయితే బాధ్యులెవ‌రంటున్న వినియోగ‌దారులు
త‌నిఖీ చేసి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న అధికారులు

ఏపీ న్యూస్ నెట్‌వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అది కృష్ణాజిల్లా పెడన మండలం ముచ్చెర్ల సమీపంలోని నేలకొండపల్లి.. ఆ ఊరు ఇప్పుడు సేంద్రియ ఆహారోత్పత్తి కేంద్రంగా అవతరించింది. ఓ యువ పారిశ్రామిక ఔత్సాహికుడు తన తొలి స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇక్కడ చైనా, ఇటలీ దేశస్థులే కాదు.. ఖండాంతరాల్లోని భారతీయులు సైతం మహాప్రియంగా భావించే పుట్టగొడుగులను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అయితే.. ఆదిలోనే కంపెనీ పక్కదారి పట్టింది. ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. నాణ్యమైన, సహజ సిద్ధ సేంద్రీయ పుట్టగొడుగుల వ్యాపారంలో తప్పటడుగులు వేస్తోంది. ఈ గుట్టును కంపెనీ సరఫరా చేస్తున్న ప్యాకింగ్ రట్టు చేసింది.

దొరికిపోయారు ఇలా..

ఇక్కడ ఉత్పత్తి జరిగిన పుట్టగొడుగుల్లో 24శాతం రిబోప్లవిన్, 15శాతం ప్యాంతో థెనిక్ యాసిడ్, 18శాతం నియాసిన్, 5శాతం విటమిన్ బీ, 5 శాతం థియామిన్.. విటమిన్లు ఉంటాయి. ఇక 16 శాతం కాపర్, 13శాతం సెలినియం, 9 శాతం భాస్వరం, 9 శాతం పొటాషియం, 3 శాతం ఐరన్ మినరల్స్, పోషక పదార్థాల్లో ప్రోటీన్లు ఆరు శాతం, ఫైబర్స్ 4 శాతం, కార్పొహైడ్రేట్స్ 1 శాతం ఉన్నట్టు తన ఇండిగ్రియంట్స్‌ని కంపెనీ ఆకర్షణీయంగా ప్రకటించింది. కానీ, 200 గ్రాముల పుట్టగొడుగుల ధర ₹80కే విక్రయిస్తోంది. నిజానికి మార్కెట్టులో కిలో సహజ సిద్ధ పుట్టగొడుగులు ధర ₹100 నుంచి ₹200 ఉంటుంది. కేవలం ఈ కంపెనీ పుట్టగొడుగులను క్లీన్, ప్యాకింగ్, మార్కెటింగ్ ఖర్చులతో కిలో పుట్టగొడుగులకు ₹1000కు విక్రయిస్తోంది. ఇక వివాహాది శుభకార్యాల బిజినెస్​లోనూ దండిగానే వసూలు చేస్తోంది. ఓ చిన్న వ్యాపారంలో ఓ యువకుడు అభివృద్ధి చెందటం స్ఫూర్తి దాయకమే. కానీ, ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలోకి తొక్కటమే దారుణం.

నిబంధనలకు తూట్లు

ఈ కంపెనీ పుట్టగొడుగుల ప్యాకింగ్ అసలు సమాచారం ఉండదు. మాన్యుపాక్టరింగ్ డేట్ అడక్కూడదు. బ్యాచ్ నెంబర్ ఉండదు. అన్నిటి కంటే ఎక్స్ ఫైర్ గడువులోనూ తిరకాసే. నిజానికి ఏ రోజుకారోజు సేంద్రీయ ఆహార పదార్థాలను వినియోగించాలి. కానీ ఈ పుట్టగొడుగుల తుది గడువు పది రోజుల లోపు అని ముద్రించారు. ఏరోజున తయారు చేశారో తెలిస్తే.. ఏ రోజున ఈ ఆహారం దెబ్బతింటుందో జనానికి తెలుస్తుంది. కానీ, పది రోజుల పరిమితి అనేది ఎలా? కాగా, పుట్టగొడుగులు కాలపరిమితి దాటితే దెబ్బతింటాయి. జనం తినరూ అని కంపెనీ ప్రతినిధులు సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు ఫ్రిజ్​లో దాచుకునే స్థితి రావటంతో ఎన్నిరోజులైనా భద్రం చేసుకోవచ్చు. కానీ, వండిన తరువాతే ఆ పదార్థం అసలు సంగతి తేలుతుంది. ఫుడ్ పాయిజనింగ్ జరిగితే పరిస్థితి ఏమిటీ? అలా జరగదని నిరూపించగలరా? ఇలాంటి ప్రశ్నలకు కంపెనీ నుంచి సమాధానం లేదు.

తనిఖీలు చేసిన చర్యలు తీసుకుంటాం: ఫుడ్ సేఫ్టీ ఆపీస‌ర్‌

ఇక.. ఈ కంపెనీ తప్పుడు ప్రచారంపై విజయవాడ ఎఫ్ఎస్ఎస్ఐ కీలక అధికారి గోపాలకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం నాసిరకం పుట్టగొడుగులను వినియోగదారులకు సరఫరా చేయటానికే ప్యాకెట్లపై సమాచారం ఇవ్వటం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కంపెనీలో తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రభకు వివరించారు.

Leave a Reply