పార్క్ చేసిన కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు
బీరుమత్తుతో కారులో ఊపిరి ఆడక మరణం
తిరుపతి – కారులో(car ) డెడ్ బాడీలు(dead bodies ) ఉండటం స్థానికంగా కలకలం రేపాయి. తిరుచానూరు రంగనాధం వీధీలో ఓ కారులో ఇద్దరు యువకుల (Youth ) మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలిసులకు (Police ) సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో బీర్లు (beer ) తాగి మత్తులో అలానే నిద్రించడంతో ఊపిరి ఆడక మృతి చెందారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో నాలుగు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారు వినయ్, దీలీప్ లుగా గుర్తించారు. ఇద్దరు యువకుల మృతదేహాలను కారు నుంచి బయట తీశారు పోలీసులు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఎస్సై సాయి నాధ్ చౌదరీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.