Tirupati |ఎన్వీయూ క్యాంపస్ లో చిక్కిన చిరుత

తిరుపతి – శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (ఎన్వీయూ) పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా ఓ చిరుతపులి సంచరిస్తుండగా, అది ఎట్టకేలకుపట్టుబడింది. ఎస్వీయూ క్యాంపస్‌లో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది.

చిరుతను అటవీ సిబ్బంది ఎస్వీ జూపార్కుకు తరలించారు. చిరుత సంచారంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు పలు ప్రాంతాలలో బోన్లను ఏర్పాటు చేశారు.

అయితే, బోనులో చిక్కకుండా చిరుత తప్పించుకు తిరుగుతోంది.ఇటీవల ప్రధాన గ్రంథాలయం వెనుకభాగంలో ఒక జింక పిల్లపై చిరుత దాడిచేసింది. దీంతో విశ్వవిద్యాలయంలో ఉదయం 7 గంటలలోపు, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరూ సంచరించవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో చిరుత బోనులో చిక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *