ఉట్నూర్, మే 14 (ఆంధ్రప్రభ) : రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట గ్రామంలోని రైస్ మిల్ వద్ద మహిళ సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు 500రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్, జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు, ఆదిలాబాద్ జిల్లా ఆర్టీఐ మెంబర్ దూట రాజేశ్వర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్బాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యూం, కాంగ్రెస్ నాయకులు మేస్రం ఓమేష్, మహిళ సంఘం నాయకురాళ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.