ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జలాశయ అధికారులు 9 గేట్లను దాదాపు 10 అడుగుల మేర ఎత్తి, భారీగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం జలాశయానికి 2,74,697 క్యూసెక్కుల వరదజలాలు చేరుతుండగా, 3,05,553 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రవాహానికి వదులుతున్నారు.

జూరాల, సుంకేశుల ప్రాంతాల నుంచి వరదలు కొనసాగుతుండటంతో, విడుదలైన నీరు నాగార్జునసాగర్ వైపు మళ్లుతోంది. శ్రీశైలం జలాశయ పూర్తి నిల్వ స్థాయి 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 881.70 అడుగుల వద్ద నమోదైంది.

మొత్తం నిల్వ సామర్థ్యం 215.708 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 197.4617 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. ఇక కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply