AP | అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యం : ఎంపీ కేశినేని శివనాథ్

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : త‌న‌ను నమ్మి గెలిపించిన జిల్లా ప్రజలకు సుపరిపాలనతో సంక్షేమం, అభివృద్ధి అందించాలనేది తన లక్ష్యమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (Keshineni Shivanath) పేర్కొన్నారు. జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్న ఆయన, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. విజయవాడ (Vijayawada) నగర అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించానన్న ఆయన ఏడాదిన్నరలోగా 8 ఆర్ యూబీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. జిల్లాకు వస్తున్న డిఫెన్స్ క్లస్టర్ ద్వారా మరిన్ని పరిశ్రమలు రానున్నాయని వాటి ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.

పార్లమెంటు సభ్యుడుగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవాడలోని భారతినగర్ లో ఉన్న ఎంపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏడాదిలో జిల్లాకు తీసుకువచ్చిన నిధులు చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎంపి కేసినేని శివనాధ్ మాట్లాడుతూ… పార్లమెంటు సభ్యునిగా ప్రయాణం మొదలు పెట్టిన తనతో అధికారులు, నాయకులు సమన్వయం తో పని చేశారని, విజయవాడ అభివృద్ధి (Development) పై నేను ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.850 కోట్ల పనులకు పదిహేను రోజుల్లో టెండర్లు పిలవబోతున్నారని, గుణదల వద్ద రెండు ఆర్.ఒ.బి లు, మాచవరం వద్ద ఒక ఆర్.ఒ.బి వస్తుందన్నారు.

మొత్తం ఎనిమిది ఆర్.ఒ.బిలు యేడాదిన్న కాలంలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అమృత్ భారత్ కింద గుణదల, రాయనపాడు రైల్వేస్టేషన్ లు అభివృద్ధితో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు. జాతీయ రహదారులతో పాటు, 6.3 కి.మి మహానాడు రోడ్ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ వస్తుందని, గొల్లపూడి (Gollapudi) వెస్ట్రన్ బైపాస్ కూడా జాతీయ రహదారిగా నిర్మాణం జరుగుతుందన్నారు. రైతులను ఒప్పించి భూ సేకరణ చేసి బైపాస్ రోడ్ నిర్మాణం చేశాం చేశామని గుర్తు చేశారు. అలాగే ఆయ‌న చేసిన‌, ప్ర‌స్తుతం చేస్తున్న ప‌లు అభివృద్ది ప‌నుల గురించి వివ‌రించారు. విజయవాడ పార్లమెంటు అభివృద్ధి లో విలువైన సూచనలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తా, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే రాజకీయంగా తన తొలి అడుగులు వేసేలా ప్రోత్సహించి వెనుక ఉండి నడిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎంపీగా పార్లమెంటులో కూర్చోబెట్టిన సీఎం చంద్ర‌బాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి ఇతర నాయకులకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో అభివృద్ధి ద్వారా నా పనితీరుతో ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని నిజం చేసి చూపిస్తానన్నారు. ప్రజా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఆనందంగా స్వీకరించి, ప్రజల పక్షాన ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ ఉంటానని శివనాద్ వివరించారు.

Leave a Reply