WGL | పెన్షనర్స్ వ్యతిరేక చట్టాన్ని ఉపసంహరించాలి..


జిల్లాల్లో క‌లెక్ట‌ర్ల‌కు వినతిప‌త్రాలు


క‌రీమాబాద్ (వరంగ‌ల్ జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టం వ‌ల్ల పెన్ష‌న‌ర్ల (Pensioners) కు న‌ష్టం క‌లుగుతుందని ప‌లువురు పింఛ‌న్‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌క్ష‌ణ‌మే ఉప సంహ‌రించుకోవాల‌ని వారు కోరుతున్నారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్ష‌న‌ర్ ఫెడ‌రేష‌న్ (All India State Pensioners Federation) పిలుపు మేర‌కు అన్ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు విన‌తి ప‌త్రాల‌ను అంద‌జేశారు. సోమ‌వారం వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద (Dr. Satya Sarada) కు పెన్ష‌న‌ర్స్ సంఘ ప్ర‌తినిధులు వినతిపత్రం సమర్పించామని వారు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా బాధ్యులు కే.సుధీర్ బాబు, ఎన్.సదానందం మాట్లాడుతూ… కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్ర‌తి ఒక్క పెన్ష‌న్‌దారుడు కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దూరి పెద్దయ్య రాష్ట్ర బాధ్యులు వేలిషోజు రామ్ మనోహర్, జి.వీరస్వామి, ఎస్.రాజయ్య టివిరయ్య, జి.సాంబయ్య, ఎన్.సారయ్య, ప్రకాష్, కుమారస్వామి, జి.రమేష్, రాధాకృష్ణ, బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply