విశాఖ : కుమారుడి ఆరోగ్యంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ. చిన్న అగ్ని ప్రమాదం అనుకున్నా కానీ.. ఇంతలా అవుతుందని అనుకోలేదని బాధపడ్డారు.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయని,. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బ్రంకోస్కోపీ చేస్తున్నారని అన్నారు. దీర్ఘకాలంలో పిల్లాడిపై ఈ ప్రభావం ఉంటుందన్నారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని తెలిపారు. పెద్ద కొడుకు పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు
మా చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు
ప్రమాద విషయం తెలుసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి ధైర్యం చెప్పారు. సింగపూర్ లో అవసరమైన సహకారం అందించవలసిందిగా అక్కడి హై కమిషనర్ కు దిశానిర్దేశం చేశారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి నా ధన్యవాదాలు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, చేసి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి , కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి , బండి సంజయ్ , ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి రఘు రామకృష్ణంరాజు , రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్ గారు, కె.ఆచ్చెన్నాయుడు , నాదెండ్ల మనోహర్ , దుర్గేష్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ , బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర సినీ నటులు, సినిమా రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించారు.
నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్తించారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అంటూ పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
.