TGPSC – గ్రూప్ 1 మెయిన్ ఫ‌లితాలు వెల్ల‌డి..

హైద‌రాబాద్ – తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ సోమవారం విడుదల చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది. అలాగే, గ్రూప్‌-2 అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా మార్చి 11న, గ్రూప్‌- 3 పరీక్ష జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను మార్చి 14న విడుదల చేయ‌నున్న‌ట్లు టిజిపిఎస్ సి ఛైర్మ‌న్ వెంక‌టేశం తెలిపారు.

కాగా, ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలున్న అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి రీ కౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల‌ని కోరారు అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌పై అభ్యంతరాలు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే 1:2 నిష్పత్తిలో తుది జాబితాను రిలీజ్ చేయ‌నున్న‌ట్ల వెల్ల‌డించారు. కాగా, గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్‌ పరీక్షలు జరిగాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై అయినప్పటికీ.. మెయిన్స్‌ పరీక్షలకు మాత్రం 21,093 మంది హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *