హైదరాబాద్: తెలంగాణలో విద్యా రంగాన్ని ప్రభావితం చేసే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలు జూలై 3, 4 తేదీల్లో బంద్కు సిద్ధమవుతున్నాయి. విద్యార్థి సంఘం పీడీఎస్యూ (PDSU) ఈ బంద్కు పిలుపునిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
విద్యా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని. రూ.8 వేల కోట్ల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలి” అంటూ పీడీఎస్యూ డిమాండ్ చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం జాగ్రత్త పడకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం,” అని హెచ్చరించింది
ఈ బంద్ ద్వారా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేసినట్లు పీడీఎస్యూ ప్రకటించింది. విద్యార్థుల హక్కుల కోసం మరింత చురుగ్గా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేసింది.