TG | యాదవులకు అండగా ప్రజా ప్రభుత్వం – రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

ధర్మారం, (ఆంధ్రప్రభ): యాదవులకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలందరికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి, చామనపల్లి గ్రామాల్లో మరణించిన గొర్రెలకు నష్టపరి హారం చెల్లింపుపుతోపాటు విద్యుత్ రంగంలో పలు వంటి అభివృద్ధి పనులకు మంత్రి అ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బొమ్మారెడ్డిపల్లి, చామనపల్లి గ్రామాల్లో యాదవులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరణించిన మేకలు గొర్రెలకు నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 8 లక్షల 70 వేల రూపాయల పరిహారం పంపిణీ చేస్తున్నామన్నారు. ధర్మారం మండలంలో యాదవ సోదరులకు విపత్కర సమయంలో ఆదుకునేందుకు పరిహారం త్వరగా మంజూరు చేసిన కలెక్టర్కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ధర్మారం మండలంలో యాదవులకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. యాదవ, కురుమ, గౌడ, మున్నూరు కాపు సోదరులకు కమ్యూనిటీ బోనాల నిర్మాణానికి అవసరమైన నిధులను నియోజకవర్గ నిధుల నుంచి కేటాయిస్తామన్నారు.

కమ్యూనిటీ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని తెలిపారు. ధర్మారం మండలంలో నూతనంగా ఐటిఐ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధర్మారం మండల ప్రజల ఆశీర్వాదంతో నేడు క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగానన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అర్హులైన నిరుపేదలకు సొంతింటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. మేడారం గ్రామంలో లూజ్ వైర్ బిగింపువంటి వివిధ విద్యుత్ శాఖ పరిధిలో 14 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామంలో సిసి రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను కోటి 30 లక్షల రూపాయలతో పూర్తి చేశామన్నారు. పేదలకు రేషన్ కార్డు సరఫరా ఇందిరమ్మ ఇండ్లు ఇతర సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రత్యేక చర్య తీసుకుంటామన్నారు. దేశంలో మరెక్కడా 18 నెలల కాలంలో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసామన్నారు. పేదలకు రేషన్ కార్డుల, సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, రైతు రుణమాఫీ జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ 15 రోజుల క్రితం చామనపల్లి గ్రామంలో 52 గొర్రెలు విద్యుత్ షాక్తో, 20 రోజుల క్రితం బొమ్మారెడ్డి పల్లి గ్రామంలో 100 గొర్రెలు అనారోగ్యంతో మరణించగా, మంత్రి ఆదేశాల మేరకు చామనపల్లి 9 మంది లబ్ధిదారులకు 3.64 లక్షల రూపాయల, బొమ్మ రెడ్డిపల్లిలో 5 మంది లబ్ధిదారులకు 5.1 లక్షల పరిహారం పంపిణీ చేశామన్నారు. అలాగే చామనపల్లిలో ప్రమాదవశాత్తు ఒక పేద కుటు ంబం ఇండ్లు కాలి పోయిన సంఘటన మంత్రి దృష్టికి రాగా, వెంటనే వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశారన్నారు.

Leave a Reply