TG | అమెరికాలో కామారెడ్డి యువ‌కుడి మృతి ..

కాలిఫోర్నియా – ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు కాల్పుల్లో మరణిస్తున్నారు. తాజగా అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గోవర్ధన్‌ ఎం.ఎస్‌చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువు ముగించుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.


అంతా బాగానే ఉందనుకున్న సమయంలో గోవర్ధన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. కాగా గోవర్ధన్‌ ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్‌, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల విఠల్‌ కుమారుడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు లండన్‌లో ఉంటున్నాడు. చిన్న కుమారుడు గూల గోవర్ధన్‌ (27) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. ఈ నెల 27న అతడు నివాసముంటున్న ఇంటిలో విగ‌త జీవుడుగా క‌నిపించాడు.. అత‌డు మృతి చెందినట్లు కుబుంబీకులకు అక్క‌డి పోలీసులు స‌మాచారం ఇచ్చారు. .కాగా గోవర్ధన్‌ మృతితో బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునగగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *