హైదరాబాద్ – నిధులేమో ఢిల్లీకి, నీళ్లేమో చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగిస్తున్నారని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదేశ్ రెడ్డి ఆరోపించారు.. నాగార్జున సాగర్ ఎపి బెటాలియన్ చేతికి వెళ్లడంపై ఆయన స్పందిస్తూ, నాగార్జున సాగర్ లో తెలంగాణ సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి ఎపి సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందన్నారు.. కేసీఆర్ సీఎంగా ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని గుర్తు చేశారు.
తెలంగాణ భవన్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదు అని పేర్కొన్నారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా- గోదావరి జలాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నామని. కానీ, ఇపుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుని పోతున్నారు అని ఆరోపించారు . ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ధోరణి మరింత పెరిగిపోయిందని ఆరోపించారు.
ఇక , ఎపి సీఆర్పీఎఫ్కు సాగర్ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్రా చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమే అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతోంది.. చంద్రబాబు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదు అన్నారు. వయా చంద్రబాబు ద్వారా ఈ ప్రభుత్వం మోడీకి దగ్గరైంది అన్నారు.
లక్ష మందితో కేసీఆర్ సభ పెట్టబోయే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడిచి కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేసింది అన్నారు. ఇక, మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పదవికి ముప్పు ఉంటుందనే రేవంత్ రెడ్డే దాన్ని ఆపుతున్నారని ఆరోపించారు…