TG | తొందరపడి పత్తి విత్తనాలు విత్తొద్దు…

  • అన్నదాతలకు వ్యవసాయశాఖ కీలక సూచన

రుతుపవనాలు ప్రవేశించిన వారం తర్వాత 60 నుండి 75. మి.మీల వర్షాపాతం నమోదైన తర్వాతనే నేల 15-20 సెంటీమీటర్ల లోతు తడిచాకే వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, కంది, పెసర తదితర వర్షధార పంటలను సాగుచేయాలని అన్నదాతలకు వ్యవవసాయశాఖ సూచించింది.

తొందరపడి పత్తి విత్తనాలు నాటొద్దని సూచించింది. ప్రస్తుతం తొలకరి జల్లులు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలు జీలుగ, పెసర, పిల్ల పెసర, ఉలవలు , జనుము తదితర పచ్చిరొట్ట విత్తనాలను విత్తుకుని భూసారాన్ని పెంచాలని వ్యవసాయశాఖ అన్నదాతలకు పిలుపునిచ్చింది.

నేల స్వభాఆన్ని బట్టి పంటల సాగును ఎంచుకోవాలని సూచించింది. వేరుశన, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము సాగు చేసే రైతులు తప్పనిసరిగా విత్తన శుధ్ది చేసుకోవాలని పేర్కొంది. మొక్కజొన్న, పత్తి రైఉలు బోదె సాళ్ల పద్దతిలో విత్తుకోవాలని, తద్వారా వర్షాలు అధికంగా కురిస్తే కాలువల ద్వారా నీరు బయటకు వెళుతుందని తెలిపింది. వరి సాగు చేసే పొలాల్లో ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పచ్చిరొట్టగా విత్తకోవాలని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *