TG | ఉగ్రవాదులను తుద ముట్టించాల్సిందే .. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం : ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయాలి, ఉగ్రవాదులను తుద ముట్టించాల్సిందేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అమాయకులైన పర్యాటకులను అమానుషంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల శిబిరాలపై మన రక్షణ దళాలు చేపట్టిన చర్యలకు సెల్యూట్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ముష్కరుల నిర్మూలన చర్యలు దిగ్విజయంగా ముగియాలన్నారు. రాజకీయాలకు అతీతంగా యావత్ దేశమంతా రక్షణ దళాలకు సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందన్నారు.

Leave a Reply