Tenth Results | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ లో టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు ..

హైద‌రాబాద్ – తెలంగాణలో (telangana ) పదో తరగతి (tenth Class ) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (suplementary ) ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 24,415 మంది (73.35 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు

Leave a Reply