Telangana | గ్రూప్ 1 ప‌రీక్ష‌లు మ‌ళ్లీ నిర్వ‌హించాలి – ఎమ్మెల్సీ క‌విత డిమాండ్

హైదరాబాద్‌: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దుచేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. . ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టి వేయబడ్డాయని చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని విమర్శించారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయమన్నారు. గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలున్నాయని చెప్పారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొందన్నారు.
జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు

Leave a Reply