Tax reduction | క్యాన్సర్ రోగులకు ఊరట

Tax reduction | క్యాన్సర్ రోగులకు ఊరట
- 17 మెడిసిన్స్పై పన్ను తగ్గింపు
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
Tax reduction | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ రోగులకు పెను ఊరటనిచ్చే కీలక ప్రకటన చేశారు. నిర్మలా సీతారామన్ ఆదివారం(ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 80 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. క్యాన్సర్ రోగులు వాడే 17 మెడిసిన్స్పై పన్ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై పన్ను భారం తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 17 రకాల ప్రాణ రక్షక క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యతో ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయి. క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల వివరించారు.
ఈ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 0%కి తగ్గించినట్లు చెప్పారు. దీంతో పాటు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ప్రత్యేక వైద్య ఆహారాల దిగుమతిపైనా పన్ను మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందుల ధరలు తగ్గి, రోగులపై ఆర్థిక భారం తగ్గనుంది.
