ములుగు, తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth reddy ) ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేస్తున్న మాజీ మావోయిస్టు సీతక్క (Minister Seethakka ) ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని మావోయిస్ట్ (Maoists) లు రాసిన లేఖపై (letter ) ఆమె నేడు స్పందించారు. తన మూలాలను తానెప్పుడు మరిచి పోలేదన్నారు. వరంగల్ జిల్లాలోని ములుగులో మంత్రి సీతక్క విలేకర్లతో మాట్లాడుతూ.. జీవో 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టానని వివరించారు. ఆ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖతోపాటు తానూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్పా.. ఎవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా సూచించారు.
Strong Reply | అన్నలకు మంత్రి సీతక్క కౌంటర్ …
