పశ్చిమ ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి అవార్డులు..

కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలోని నలుగురు ఉద్యోగులు మొంథా తుఫాన్ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మొంథా తుఫాన్ సమయంలో సంసిద్ధత, సహాయ కార్యకలాపాలలో అంకితభావం, నాయకత్వం, అవిశ్రాంత కృషికి గుర్తింపుగా రాష్ట్రస్థాయి ఎంపికలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈనెల 1న విజయవాడలో అవార్డుల ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల కరతాళ ధ్వనుల మధ్య‌ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అవార్డు గ్రహీతలను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొంథా తుఫాన్ సమయంలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చాయని కితాబు ఇచ్చారు. అన్ని శాఖలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అన్ని శాఖలు సమాంతర సేవలను అందించిననూ తీర ప్రాంతంలో విశిష్ట సేవలను అందించిన మూడు శాఖల ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయడం జరిగిందన్నారు. వీరు సవాలుతో కూడిన సమయంలో పౌరుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడంలో వీరి నిబద్ధత, సామర్థ్యం, కరుణకు గుర్తింపుగా, ప్రజా సేవ యొక్క అత్యున్నత ప్రమాణాలకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శప్రాయమైన సహకారానికి హృదయపూర్వక ప్రశంసలు, కృతజ్ఞతలను తెలియజేస్తూ అవార్డును అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని శాఖలు భవిష్యత్తులో భవిష్యత్తు ఇదే సహకారంతో పనిచేసి జిల్లాకు మరింత పేరు తెచ్చేలా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

అవార్డులు పొందిన వారు..
పంచాయతీరాజ్ శాఖ ఈఈ సత్యనారాయణ, ఏఈ నాగేశ్వరరావు, మత్స్య శాఖ ఏడి ఎల్ ఎల్ ఎన్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ తాడి లోకేష్ ఉన్నారు.

Leave a Reply